Rc.No.001/Director RMSA/SSAP Dated: 21-10-2020
AP Samagra Siksha-Quality Education -Reading Literacy Campaign-Issue of guidelines on preparatory activities of the campaign-Reg.
పాఠశాలల్లో గ్రంథాలయాలకు కొత్తరూపు - 26 నుంచి కార్యాచరణ అమలు
విద్యార్థుల్లో పఠనాభిలాషను పెంపొందించేందుకు రాష్ట్ర సమగ్ర శిక్ష కార్యాచరణను ప్రకటించింది.
నాణ్యమైన విద్య, అక్షరాస్యతను పెంచే కార్యక్రమంలో భాగంగా ఈ నెల 26వ తేదీ నుంచి 31వ తేదీ వరకు పాఠశాలల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించనుంది.
ప్రతి విద్యార్థి తన తరగతి స్థాయికి పఠనాభిలాషను కలిగి ఉండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు.
జాతీయ స్థాయిలో ‘మేము చదవటాన్ని ఇష్టపడతాం’ (వి లవ్ రీడింగ్) కార్యక్రమాన్ని ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు అమలు చేయనున్నారు.
చదివే వాతావరణాన్ని పెంపొందించే విధంగా కృషి చేస్తారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, యువత, ఉద్యోగ విరమణ చేసిన వారు, విద్యావేత్తలు, ఎన్జీవోల సహకారంతో కార్యక్రమాన్ని తీర్చిదిద్దాలని యోచిస్తున్నారు.
కార్యక్రమం ఇలా... :
ఈ నెల 26న చిరిగిన పుస్తకాల్ని సరిచేయాలి.
27న పాఠశాలల్లో అందుబాటులో ఉన్న పుస్తకాల్ని వరుస క్రమంలో సర్దాలి.
28న ప్రతి తరగతిలో గ్రంథాలయ పుస్తకాలను అందుబాటులో ఉంచాలి.
30న పాఠశాలలో పుస్తకాలను ఒక బుక్ బ్యాంకుగా ఏర్పాటు చేసి విస్తృత ప్రచారం చేయాలి.
31న కథలు చెప్పే సామర్థ్యం ఉన్న వారిని గుర్తించాలి.విద్యార్థులు సెలవు దినాల్లో గ్రామంలో ఉన్న కమ్యూనిటీ రీడింగ్ కేంద్రాలకు వెళ్లి చదివే విధంగా ప్రోత్సహించాలి.
0 Post a Comment:
Post a Comment