Tuesday 11 August 2020

ఆడపిల్లలకు ఆస్తి హక్కు. సుప్రీం చారిత్రక తీర్పు

 

ఆడపిల్లలకు ఆస్తి హక్కు. సుప్రీం చారిత్రక తీర్పు





హిందూ అవిభక్త కుటుంబానికి చెందిన ఆస్తిపై ఆడపిల్లలకు ఉన్న హక్కును గురించి భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం నేడు చారిత్రక తీర్పు వెలువరించింది. తండ్రి (లేదా తల్లి) 2005 కంటే ముందే మరణించినా కుమార్తెలకు వారసత్వంగా ఆస్తిని పొందే హక్కు ఉంటుందని.. జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం నేటి తీర్పులో స్పష్టం చేసింది.

తండ్రి, కూతురు ఇద్దరూ జీవించి ఉంటేనే కుమార్తెకు సహ-వారసత్వపు హక్కు దాఖలు అవుతుందని సుప్రీం 2005 సెప్టెంబర్‌ 9లో సవరణ తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సవరణ తేదీ నాటికి కుమార్తె, తండ్రి జీవించి ఉన్నా లేకపోయినా ఆమెకు తండ్రి ఆస్తిలో హక్కు ఉంటుందన్న తాజా తీర్పు ప్రాముఖ్యతను సంతరించుకుంది. తాజా తీర్పుననుసరించి.. సవరణ తేదీ నాటికి కుమార్తె జీవించి లేకున్నా, ఆమె సంతానం చట్టపరంగా ఆమెకు రావలసిన వాటాను కోరవచ్చు.

కుమారుడితో సరిసమానంగా కుమార్తెకూ ఆస్తిలో హక్కును ప్రసాదించిన ఈ తీర్పు.. హిందూ అవిభక్త కుటుంబాల్లో ఆడపిల్లల ఆస్తి హక్కుపై ఇప్పటి వరకు ఉన్న సందిగ్ధాన్ని తొలగించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top